ఏపీ కొత్తసీఎస్ ఎవరంటే..?

ఆంధ్ర ప్రదేశ్ కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విజయానంద్‌ నియామితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎస్‌ విజయానంద్‌ పదవీ కాలం వచ్చే సంత్సరం నవంబరు వరకు ఉంది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్​ కుమార్‌ ప్రసాద్‌ ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్నారు. ఈ ఏడాది జూన్‌ 7న సీఎస్​గా బాధ్యతలు తీసుకున్న ఆయన పదవీకాలం ఆ నెలాఖరుతోనే ముగిసింది.

6 నెలల పాటు సీఎస్‌ పదవి కాలాన్ని పొడిగించాలని ఏపీ సర్కార్ కేంద్రాన్ని కోరడంతో ఆ మేర అనుమతులు వచ్చాయి. మరోసారి ఇంకో ఆరు నెలలు పొడిగించేందుకు అవకాశం ఉంది. కానీ ఏపీ ప్రభుత్వం నుంచి ఆ దిశగా ప్రయత్నాలేమీ లేకపోవడంతో ఈ నెలాఖరుకు నీరభ్​ కుమార్‌ పదవీ విరమణ చేయడం ఖరారైంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News