ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ ఫైనల్ మ్యాచ్ లో హరియాణా స్టీలర్స్ జట్టు విజయం సొంతం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్ లో 32-23తో పాట్నా పైరేట్స్ పై హరియాణా స్టీలర్స్ గెలుపొంది తొలిసారి ఛాంపియన్ గా అవతరించింది. మూడుసార్లు ఛాంపియన్ గా నిలిచిన పాట్నా పైరేట్స్.. నాలుగోసారి టైటిల్ ను సొంతం చేసుకోలేకపోయింది. ఫైనల్ మ్యాచ్ లో హరియాణా తరఫున శివమ్ పటారే అత్యధికంగా 9 పాయింట్లు, మహ్మద్ రేజా షాద్లు 7, పాట్నా పైరేట్స్ తరఫున గురుదీప్ 6 పాయింట్లు సాధించారు.
