జడ్పీ ఉన్నత పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తా: ఎంపీ ఈటెల

హైదరాబాద్, డిసెంబర్ 28: జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల అభివృద్ధికి నిరంతరం తమ వంతు సహకారం అందిస్తానని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ అన్నారు. బౌరంపేట్ గవర్నమెంట్ స్కూల్ లో 800 పైగా విద్యార్థుల ఉన్న కారణంగా మంచి నీటి సమస్య తీవ్రంగా ఉన్నదని కౌన్సిలర్ పీసరి బలమణి కృష్ణారెడ్డి అభ్యర్థన మేరకు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ కి తెలిపిన వెంటనే స్పందించి తన ఎంపీ లాడ్స్ నిధుల కింద బోరు మంజూరు చేయించారు. శనివారం శంకుస్థాపన చేయడానికి బౌరంపేట్ జడ్పీహెచ్ స్కూల్ కి విచ్చేసిన ఎంపీ ఈటెల రాజేందర్ కి బౌరంపేట్ బీజేపీ నాయకులు స్వాగతం పలికి, శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఈటెల రాజేందర్ కొబ్బరికాయ కొట్టి బోరు ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్కూల్లో ఇంకా ఏమేం సమస్యలు ఉన్నాయి, ఎలాంటి మౌలిక వసతులు కావాలో అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ ప్రస్తుతం స్కూల్ కు గ్రౌండ్ లేక పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుందని, ప్రభుత్వ హై స్కూల్ కి 5 ఎకరాల స్థలం కేటాయించేలా చర్యలు తీసుకొనగలరని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బౌరంపేట్ బీజేపీ నాయకులు డా ఎస్ మల్లారెడ్డి, పీసరి కృష్ణారెడ్డి, నల్ల రామచంద్రరెడ్డి, డి ప్రభాకర్ రెడ్డి, సరుగారి సత్తిరెడ్డి, నర్సింహా చారి, ప్రశాంత్, వీరేష్కుమార్, రోజా, సీతారాం రెడ్డి, అశోక్, మన్మోహన్, ఉపాధ్యాయులు ప్రభావతి, శ్రీధర్, పద్మప్రియ, భాస్కర్ గౌడ్, జయశ్రీ, దనరాజ్, రాజు, అనిల్, జగన్, విద్యార్థులు తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News