హైదరాబాద్, డిసెంబర్ 27: మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ అదుపుతప్పి డివైడర్ ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్లో బుల్లెట్ బైక్పై వేగంగా ఇచ్చిన ఇద్దరు యువకులు డివైడర్ను ఢీకొట్టి రోడ్డుపై పడ్డారు. ఈ ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు హాస్పిటల్ తరలిస్తుండగా ప్రాణాలు వదిలాడు. మృతులు బోరబండకి చెందిన రఘుబాబు, ఆకాన్ష్ గా గుర్తించారు. బైక్ నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
