ఇండస్ట్రీలో ఉన్న సమస్యలపైనే కాకుండా సామాజిక అంశాలపై ఎప్పుటికపుడు గొంతు వినిపించే నటీమణుల్లో టాప్లో ఉంటుంది పూనమ్ కౌర్. సోషల్ మీడియాలో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని తెలిసిందే. ఈ భామ ఎప్పుడు ఏదో ఒక కామెంట్ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. మహిళలెవరూ సీఎం సమావేశానికి వెళ్లేంత ముఖ్యమేం కాదంటోంది పూనమ్ కౌర్. ఈ మేరకు పూనమ్ కౌర్ ఎక్స్లో ట్వీట్ చేసింది. సీఎంతో సమావేశానికి మహిళలెవరూ కూడా ముఖ్యమైన వ్యక్తులుగా పరిగణించబడలేదు.
ఎందుకంటే మహిళలకు ఎలాంటి సమస్యలుండవు. వ్యాపార సంబంధ విషయాలు, హీరోకు సమస్యలు వచ్చినప్పుడు మాత్రం పరిశ్రమ నిలబడుతుంది. కానీ మహిళలెవరికీ సమస్య ఉండదు.. అంటూ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించింది పూనమ్ కౌర్. ఈ కామెంట్స్ సినీ ప్రముఖులతో భేటిను ఉద్దేశించి చేసినవేనంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ కామెంట్స్పై ఎవరెలా స్పందిస్తారనేది చూడాలి.