సైబర్‌ కేటుగాళ్లుతో.. తస్మాత్ జాగ్రత్త: సజ్జనార్‌

హైదరాబాద్‌, డిసెంబర్‌ 27: కొద్దిరోజుల్లో కొత్త సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాము. అయితే కొత్త సంవత్సర వేడుకలపై సైబర్‌ కేటుగాళ్లు ఫోకస్‌ పెట్టారు. న్యూయర్‌ విషెస్‌ అంటూ అమాయకులను దోచుకునే ప్లాన్‌లో ఉన్నారు. దీనిపై ముందుగానే అలర్ట్‌ అయిన సైబర్‌ కైర్ర అధికారులు ప్రజలకు తగు సూచనలు జారీ చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రజలకు సీనియర్‌ ఐపీఎస్‌, టీజీ ఆర్టీసీ ఎండీ వీ.సీ.సజ్జనార్‌ ఎక్స్‌ వేదికగా హెచ్చరించారు. నూతన సంవత్సర శుభాకాంక్షల పేరుతో ఉన్నదంతా దోచుకునేందుకు సైబర్‌ నేరగాళ్లు ప్లాన్ వేశారని, అలర్ట్‌గా ఉండాలని తెలిపారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వారి చేతికి చిక్కి ఖాతాలు ఖాళీ చేసుకోవడమే కాదు, ఫోన్లలో ఉన్న వ్యక్తి గత సమాచారం అంతా పోగొట్టుకోవాల్సి వస్తుందన్నారు.

న్యూ ఇయర్‌ విషెస్‌ చిత్రాలు, సందేశాలను విూ పేరుతో సహా తయారు చేసుకొని ఇతరులకు పంపవచ్చని, ఇందుకోసం ఈ కింది లింకుపై క్లిక్‌ చేసి వివరాలు నమోదు చేస్తే చాలని స్మార్ట్‌ ఫోన్లకు సందేశాలు పంపిస్తున్నారు. పొరపాటున వాటిపై క్లిక్‌ చేశారంటే తిప్పలు తప్పవన్నారు. ఆండ్రాయిడ్‌ ప్యాకేజీ కిట్‌(ఏపీకే) రూపంలో పంపే ఈ గూఢచర్య అప్లికేషన్‌ ఒకసారి ఫోన్లోకి జొరబడిరదంటే అందులోని సమస్త సమాచారం నేరగాళ్ల అధీనం లోకి వెళ్లిపోతుందన్నారు. బ్యాంకు ఖాతాల వివరాలు, ఫొటోలు, వీడియోలు, కాంటాక్ట్‌ నంబర్లు, అన్నీ తీసేసుకుంటారు. కాబట్టి నూతన సంవత్సర సందేశాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే పెద్ద ఎత్తున సందేశాలు పంపుతున్న సైబర్‌ కేటుగాళ్లు రాబోయే రెండు, మూడు రోజుల్లో తమ దాడుల్ని తీవ్రతరం చేసే అవకాశం ఉంది.. జాగ్రత్త! అంటూ సజ్జనార్‌ ట్వీట్‌ చేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News