జనగణనతో పాటే కులగణన చేపట్టాలి.. రేవంత్‌రెడ్డి ప్రతిపాదన

  • సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా ఆమోదం 

బెంగళూరు, డిసెంబర్‌ 26: జనగణనలో కులగణన చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రతిపాదనకు సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. తెలంగాణలో కులగణను చేపట్టామని, దేశవ్యాపంగా దీనిని చేపట్టాల్సి ఉందన్నారు. రాహుల్‌ గాంధీ ఆదేశాల మేరకు తెలంగాణలో అమలు చేస్తున్నామని, అయితే దేశంలో చేపట్టే జనగణనతో పాటు దీనిని చేటపట్టాల్సి ఉందన్నారు. కర్ణాటకలోని బెలగావిలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశానికి తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ మాట్లాడారు. ‘దేశంలో త్వరలో పార్లమెంట్‌ నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశాలు ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన జరిగితే దక్షిణాది రాష్టాల్ల్రో సీట్ల పెంపు తక్కువగా ఉండి నష్టపోయే పరిస్థితి ఉంటుంది. దీనిపై ఏఐసీసీ వ్యూహాత్మకంగా ఆలోచించాలి.

నియోజకవర్గాల సంఖ్య పెంపు విషయంలో దక్షిణాది రాష్టాల్రకు నష్టం జరగకుండా అత్యంత జాగ్రత్తగా ముందడుగు వేయాలి. చట్ట సభల్లో మహిళా బిల్లును కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలోనే ప్రవేశ పెట్టి ఒక కొలిక్కి తెచ్చాం. ఈ నేపథ్యంలో ఆ బిల్లుపై మనం ఎక్కవగా ప్రచారం చేయాల్సి ఉందన్నారు. భాజపా.. మహిళా బిల్లుతో వారికి అనుకూలంగా రిజర్వేషన్లు చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఆ విషయంలో కాంగ్రెస్‌ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. తెలంగాణలో కులగణన దేశంలోనే మార్గదర్శిగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది చేయబోతున్న జనగణనలో దేశ వ్యాప్తంగా కులగణన కూడా చేపట్టాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసి పోరాటం చేయాలి. ఈ విషయంలో సీడబ్ల్యూసీ ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సూచించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News