రాజమండ్రి, డిసెంబర్ 25: విశాఖ డెయిరీ పాలక వర్గం బీజేపీలో చేరింది. రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సమక్షంలో డెయిరీ ఛైర్మన్ ఆడారీ ఆనంద్తో పాటు డైరెక్టర్లు యలమంచిలి మున్సిపల్ ఛైర్పర్సన్ రమాకుమారి బీజేపీ కండువాలను కప్పుకున్నారు. రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి ఆడారి ఆనంద్కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. వారి తండ్రితో మా నాన్నకు అవినాభావ సంబంధం ఉందన్నారు. పార్టీలోకి వచ్చిన తరువాత సిద్దాంతం, క్రమశిక్షణ అవలంబిస్తూ వారి ప్రాంతంలో పార్టీని బలోపేతం చెయ్యడానికి కృషి చేయాలని సూచించారు.
ప్రధాని మోడీ అవినీతి రహిత పాలన అందిస్తున్నారని, అలాగే దృఢ నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట అంటూ పేర్కొన్నారు. 2029 ఎన్నికల్లో కూడా బీజేపీని ప్రజలు ఆశీర్వదిస్తారని ధీమా వ్యక్తం చేశారు. 11వ ఆర్థిక శక్తి గా ఉన్న దేశాన్ని 5వ ఆర్థిక శక్తిగా ప్రధాని మోడీ తీర్చిదిద్దారన్నారు. అమిత్ షా అంబేడ్కర్ను అవమానించారని కాంగ్రెస్ దుష్పచ్రారం చేస్తోందన్నారు. కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్కు భారతరత్న ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ట్రైబల్ మహిళను రాష్ట్రపతి చేసిన బీజేపీ.. మహిళలను ఎంతగా గౌరవిస్తుందో ప్రజలు తెలుసుకోవాలన్నారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలకు బీజేపీ శ్రీకారం చుట్టిందన్నారు.
స్వతహాగా బీజేపీలో ప్రజలు చేరుతున్నారని.. 25 లక్షల మంది ప్రజలు పార్టీలో చేరారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి సహాయ సహకారాలు అందజేస్తున్నారన్నారు. చిటికెడు మట్టి కూడా గత ప్రభుత్వం విదల్చలేదని విమర్శించారు. రాష్టాన్రికి పన్ను రాయితీలు, అమరావతి నిర్మాణానికి నిధులు, పోలవరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. గడిచిన 5 ఏళ్లలో రాక్షస విధ్వంసకర పాలన చూశామన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్తో కచ్చితంగా ఏపీ అభివృద్ధి పదంలో దూసుకుపోతుందన్నారు. సుపరిపాలన అందించడం వల్లే బీజేపీని వరుసగా మూడుసార్లు ప్రజలు గెలిపించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు.
బీజేపీని మరో రెండు మూడు సార్లు అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ బీజేపీకి స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు బీజేపీని సమర్థించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం సభలో ఎంపీ పురంధేశ్వరి మాట్లాడారు. కండువా వేసుకోవడమే కాదు.. బాధ్యతలు కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. బీజేపీ రాష్ట్రంలో బలమైన శక్తిగా రూపుదిద్దుకునే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆమె క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. వాజ్పేయ్ జన్మదినోత్సవం రోజున చేరికలు రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి నాంది అంటూ ఆమె వ్యాఖ్యానించారు.
వాజ్పేయ్ జీవిత ప్రస్థానంలో దేశాభివృద్ధికి, పార్టీ ఎదుగుదలకు ప్రత్యేక స్థానం ఉందన్నారు.మహనీయుల ఆశయాలను, సిద్దాంతాలను ఆచరణలో పెట్టిన రోజు వారికి అర్పించే నిజమైన నివాళులు అంటూ పేర్కొన్నారు. రాజకీయ ప్రజా జీవితంలోకి వచ్చే ప్రతి ఒక్కరూ వాజ్పేయ్ను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలను పెంచే విధంగా సర్వ శిక్షా అభియాన్ ద్వారా ఉచిత విద్యను ప్రవేశపెట్టిన మహానీయుడు వాజ్పేయ్ అంటూ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో 25 లక్షల సభ్యత్వాలను బీజేపీ నమోదు చేయగలిగిందని వెల్లడిరచారు. ప్రతి వర్గంలోనూ బీజేపీ పట్ల సదుద్దేశం ఉందన్నారు.
దేశంలో ఉన్న 1500 పార్టీల్లోనూ బీజేపీ భిన్నమైనదని.. అందుకనే టీ అమ్ముకునే వ్యక్తి ప్రధాని కాగలిగారని.. సాధారణ ట్రైబల్ మహిళ రాష్ట్రపతి కాగలిగిందన్నారు. వాజ్పేయ్ అడుగుజాడల్లోనే ప్రధాని మోడీ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారన్నారు. రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా నిలబెట్టడానికి భారత ప్రధాని మోడీ కృషి చేస్తున్నారన్నారు. బీజేపీ నిమ్న కులాలకు, అట్టడుగు ప్రజలకు న్యాయం చేయడమే బీజేపీ అంతిమ లక్ష్యమని వెల్లడిరచారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ను అందరికంటే ఎక్కువ గౌరవించింది బీజేపీ మాత్రమేనన్నారు. అంబేడ్కర్కు భారతరత్న ఇచ్చింది బీజేపీనేనని పేర్కొన్నారు. అంబేడ్కర్ ఇంటిని సైతం పవిత్ర స్థలంగా మార్చిన పార్టీ బీజేపీనేనని అన్నారు.
బీసీ కమిషన్కు చట్టబద్ధత కల్పించింది బీజేపీనే అని వెల్లడిరచారు. కులమతాలకు అతీతంగా బీజేపీ దేశాన్ని అభివృద్ధి చేసిందన్నారు. 33 శాతం మహిళా బిల్లును అమోదించేట్లు చేసిన ఘనత బీజేపీదేనని.. 65 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్కు మహిళలు గుర్తు రాలేదన్నారు. బెజవాడలో నిర్వహించనున్న హైందవ శంఖారావం విజయవంతం చేయాలని కోరారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ను కాంగ్రెస్ అనేక సార్లు అవమానించిందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వంలోనే బాబాసాహెబ్ అంబేడ్కర్కు భారతరత్న వచ్చిందన్నారు. బీసీ కమిషన్కు మోడీ ప్రభుత్వమే చట్టబద్ధత కల్పించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి స్పష్టం చేశారు.