అయ్యప్ప స్వామి మండల పూజ సందర్భంగా శబరిమల ఆలయం భక్తుల రద్దీతో నిండిపోయింది. హరిహరసుతుడిని దర్శించుకునేందుకు భక్తులు కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో నిలబడి ఉన్నారు. గడచిన సోమవారం లక్షా ఆరు వేల మందికి పైగా భక్తులు స్వామి దర్శనం చేసుకున్నారు, ఇది ఈ సీజన్లో రికార్డుగా నిలిచింది. ఆలయ అధికారుల ప్రకారం, రేపు అయ్యప్ప మండల పూజ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
