కేరళ పర్యటన ముగించుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్కు చేరుకోనున్నారు. సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతిలో మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి రచించిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం అనంతరం గచ్చిబౌలిలో జరుగనున్న ప్రముఖ షట్లర్ పీవీ సింధు రిసెప్షన్లో కూడా సీఎం పాల్గొననున్నారు.
