తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఈ నెల 30న సచివాలయంలో సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించనున్నారు. ముఖ్యంగా యాదగిరిగుట్టకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు అంశంపై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ బోర్డు ఏర్పాటు ద్వారా యాదగిరిగుట్ట అభివృద్ధికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రత్యేక బోర్డు 20 మంది సభ్యులతో ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
