సంథ్య థియేటర్ ఘటన నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలవాలని భావిస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాత నాగవంశీ వెల్లడించారు. అమెరికాలో ఉన్న నిర్మాత మరియు ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు తిరిగి హైదరాబాద్కు రాగానే సీఎంను కలుసుకుంటారని తెలిపారు. టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోలపై సీఎంతో చర్చలు జరపాలని సినీ పరిశ్రమ పెద్దలు నిర్ణయించారు.
