ఎన్టీఆర్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. కొన్ని నెలల క్రితం, తన సినిమా “దేవర” విడుదల సందర్భంగా చెన్నై అపోలో ఆసుపత్రిలో క్యాన్సర్తో బాధపడుతున్న తన వీరాభిమాని కౌశిక్ను ఎన్టీఆర్ పరామర్శించారు. కౌశిక్ తన చివరి కోరికగా “దేవర” సినిమా చూడాలని కోరుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్, కౌశిక్ను వీడియో కాల్ ద్వారా పరామర్శించి, అతని చికిత్సకు సహాయం చేస్తానని మాటిచ్చారు.
అయితే, ప్రస్తుతం కౌశిక్ కుటుంబం మరో రూ. 20 లక్షలు ఆసుపత్రి ఫీజు చెల్లించాల్సి ఉండడంతో అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో, ఎన్టీఆర్ నుంచి స్పందన లేదని బాధితుడి తల్లి సరస్వతి చెప్పడం చర్చకు దారితీసింది. అభిమానుల మాటలను గౌరవించే ఎన్టీఆర్ ఈ విషయంలో స్పందించి, బాధిత కుటుంబానికి సహాయం చేస్తారని ఆశిస్తున్నారు.