సహజ నటి సాయి పల్లవి తాజాగా వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా ఆమె కాశీ అన్నపూర్ణ ఆలయాన్ని, గంగా హారతిని కూడా దర్శించుకుని భక్తితో నమస్కరించింది. కాశీ విశ్వనాథ ఆలయ సందర్శన సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సాయి పల్లవి బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్తో కలిసి రామాయణ చిత్రంలో నటిస్తోంది.
