కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ను కేంద్ర మంత్రి బండి సంజయ్ పరామర్శించారు. డాక్టర్లతో మాట్లాడి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం బాలుడి తండ్రి, కుటుంబ సభ్యులను ధైర్యం చెబుతూ, శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థించాలని సూచించారు. రాజకీయ విమర్శలను పరస్పరంగా నిలిపివేయాలని బండి సంజయ్ కోరారు.
