తమ ఇంటి మీద దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందించారు. మీడియా ఎదుట మాట్లాడారు. తాము ఇప్పుడు సంయమనం పాటించాల్సిన సమయం అని పేర్కొన్నారు. ఈ సమయంలో తాము రియాక్ట్ అవ్వకూడదన్నారు. దాడి చేసిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేసి వారిని తీసుకెళ్లారని చెప్పారు. మళ్లీ ఎవరైనా గొడవ చేయడానికి వస్తే పోలీసులు ఇంటి దగ్గర రెడీగా ఉన్నారన్నారు. ఇలాంటి వాటిని ఎవరూ ప్రోత్సహించకూడదని కోరారు.
