ప్రధాని నరేంద్ర మోదీని కువైట్ అత్యున్నత పురస్కారం వరించింది. కువైట్ ఎమిర్ షేక్మిశాల్ అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబా ‘ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్’ అవార్డును మోదీకి అందజేశారు. ఇది వివిధ దేశాల నుంచి ప్రధాని మోదీకి లభించిన 20వ అంతర్జాతీయ అవార్డు. స్నేహానికి చిహ్నంగా దేశాధినేతలకు, రాజకుటుంబ సభ్యులకు కువైట్ ఈపురస్కారం అందజేస్తుంది. గతంలో అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జ్ బుష్ తదితరులు ఈఅవార్డును అందుకున్నారు.
