కరీంనగర్ కొత్తపల్లిలో.. తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ, ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన భరోసా కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ ఆదివారం ప్రారంభించారు. భరోసా కేంద్రంలో బాధితురాలికి భద్రత కల్పించడం, సాక్ష్యాలను రూపొందించడం, వైద్య సదుపాయం, కోర్టుకు చేరే వరకు భరోసా కేంద్ర అధికారులు సహాయపడతారని తెలిపారు.
సంధ్య థియేటర్ ఘటన పై స్పందిస్తూ.. అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ నిర్లక్ష్యం కారణంగానే ఓ నిండు ప్రాణం పోయిందని.. చిన్నారి ఆసుపుత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని అన్నారు. ఘటన జరిగిన రోజు థియేటర్ నుంచి వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరించినా.. అల్లు అర్జున్ వినిపించుకోలేదని చెప్పారు.