కరెంట్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ వైసీపీ పార్టీ ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా నిరసన ర్యాలీలు నిర్వహించనుంది. చార్జీలను తగ్గించే వరకు పోరాటం కొనసాగుతుంది అని మాజీ మంత్రి జోగి రమేష్ తెలిపారు. మాజీ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రజలపై భారం పెంచే చర్యలకు పాల్పడ్డారు అని విమర్శించారు. వైసీపీ నేతలు ప్రజలతో కలిసి పోరాటం కొనసాగించనున్నట్లు వెల్లడించారు.
