అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం మాధవరంలో కాల్పుల కలకలం సంభవించింది. ఇద్దరు పాత సామాన్ల వ్యాపారులపై దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రమణ (30) మరియు హనుమంతు (50) అనే వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. కాల్పుల అనంతరం, వీరిద్దరినీ రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.
