పుష్ప-2 మూవీ రాష్ట్ర రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. సంధ్య థియేటర్ వ్యవహారంలో ఓ మహిళ చనిపోగా.. బాలుడు ఆస్పత్రిలో విషమంగా ఉన్నాడని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఆవేదనతో మాట్లాడారు. ఇదే సమయంలో సినీ ఇండస్ట్రీ పెద్దలపై ఆయన నిప్పులు చెరిగారు. కాగా.. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై నిన్న రాత్రి అల్లు అర్జున్ ప్రెస్మీట్ నిర్వహించారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
థియేటర్కు వెళ్లిన కాసేపటికే పోలీసులు చెప్పడంతో తాను వెళ్లిపోయానని బన్నీ వివరణ ఇచ్చుకున్నారు. అయితే ఆ రోజు థియేటర్లో ఆయన ఇంటర్వెల్ వరకూ ఉన్నారని.. జాతర సీన్ కూడా చూశారని ‘ఎక్స్’ వేదికగా వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే #AlluArjunArrested హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.