జమిలి ఎన్నికలకు సంబంధించి ఏర్పాటైన 39 మంది సభ్యుల జేపీసీకి ఛైర్పర్సన్గా కేంద్ర మాజీమంత్రి, బీజేపీ ఎంపీ పీపీ చౌదరి ఎంపికయ్యారు. ఈ మేరకు లోక్సభ సెక్రటేరియట్ ప్రకటన విడుదల చేసింది. దేశంలో ఒకేసారి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనం చేసేందుకు కేంద్రం జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది.
