మార్చి నెల దర్శన టిక్కెట్ల విడుదల తేదీల్లో టీటీడీ మార్పులు చేసింది. మార్చి నెల శ్రీవాణి టికెట్ల కోటాను ఈనెల 25న ఉదయం 11 గంటలకు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 26న ఉ. 11 గంటలకు, సాయంత్రం 3 గంటలకు తిరుమలలోని వసతి గదుల కోటాను విడుదల చేయనున్నట్లు బోర్డు వెల్లడించింది. ఈ మేరకు తాజా ప్రకటన విడుదల చేసింది.
