విశాఖపట్నం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో శుక్రవారం గోపాలపట్నం ఇందిరానగర్ లో కొండవాలు ప్రాంతంలో ప్రహరీ గోడ కుప్పకూలిపోయింది. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం లేనందున, ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న జీవీఎంసీ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన తొలగింపు పనులు చేపట్టారు. వర్షం కారణంగా నగరంలో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయన్న ప్రజల్లో భయాలు వ్యక్తమవుతున్నాయి.
