తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చలి విజృంభిస్తుంది. 15 డిగ్రీల లోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో చలి తీవ్రత నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో పాఠశాలల వేళల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఉదయం 9:40 నుంచి సాయంత్రం 4:30 వరకు స్కూళ్లు నడపాలని ఆదేశించింది. ప్రస్తుతం 9:15 నుంచి సాయంత్రం 4:15 వరకు పాఠశాలలు నడుస్తున్నాయి. ఈ మార్పులు ప్రైమరీ, హైస్కూల్లతో పాటు కేజీబీవీ, మోడల్ స్కూల్స్లకు కూడా వర్తిస్తాయి.
