నేడు ఉదయం 11 గంటలకు నెక్లెస్ రోడ్ లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద భారీ జన సమీకరణ తో రాజ్ భవన్ వరకు చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్న కాంగ్రెస్. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇంచార్జ్ శ్రీమతి దీపా దాస్ ముంన్షి, మంత్రులు, ఎంపీ లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు పాల్గొంటారు.
అమెరికా లో గౌతమ్ ఆధాని పై వచ్చిన ఆర్థిక అవకతవకలు దేశ వ్యాపార, ఆర్థిక రంగాలలో పరువును దెబ్బతీసాయి. ఆధాని పై ఆర్థిక అవకతవకలు, నేరారోపణలు, అవినీతి, మోసం, మని లాండరింగ్, మార్కెట్ మనిపులేషన్ లాంటి అంశాలలో ఆయనపై ఆరోపణలు దేశ ప్రతిష్టను దెబ్బతీసాయి.