అల్లు అర్జున్ వరుడు మూవీ హీరోయిన్ భానుశ్రీ మెహ్రా ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె తమ్ముడు నందు, అనారోగ్యంతో 7 రోజుల క్రితం మృతి చెందాడు. ఈ ఘటనపై ఎమోషనల్ అయిన భానుశ్రీ ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేస్తూ, “ఇది పీడకలలా అనిపిస్తోంది. నువ్వు లేవనే నిజాన్ని ఎలా నమ్మాలి? జీవితాంతం నీ జ్ఞాపకాలను మోస్తాను” అంటూ తన బాధను వ్యక్తం చేసింది.
