కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని, నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఆలయాల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరతానని మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఆలయాల్లో ప్రసాదం సహా వినియోగించే వస్తువుల్లో నాణ్యతపై రాజీపడబోమని స్పష్టం చేశారు. “అన్ని ఆలయాల ఈసీలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ప్రసాదం లేదా ఇతర వస్తువుల నాణ్యతపై లోపం ఉంటే సహించేది లేదు. పుష్కరాల సమయంలో భక్తుల సౌకర్యానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాల్సి ఉంటుంది” అని ఆమె అన్నారు.
