భారత దేశ తొలి ఉప ప్రధాని, ఉక్కు మనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు ఆ మహనీయుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. నివాళులు అర్పించిన వారిలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, కొండా సురేఖ గారు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు ఉన్నారు.
