తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత కరెంట్ ఇచ్చేందుకు ఆదేశాలు జారీ చేశామని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఇప్పటికే పేదవారికి 200 యూనిట్లలోపు, రైతులకు ఉచితంగా విద్యుత్తు ఇస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యాప్రమాణాలు పెంచేందుకు ఉచిత కరెంట్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
