తిరుమల నడకమార్గంలో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ అమీర్పేట్కు చెందిన సీహెచ్ రవికుమార్ అనే యువకుడు స్నేహితులతో సరదాగా మాట్లాడుతూ.. తిరుమల నడక మార్గంలో వెళుతుండగా హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలాడు. వెంటనే తిరుమలలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయారని డాక్టర్లు తెలిపారు. దీంతో రవికుమార్ మృతదేహాన్ని తిరుమల నుంచి హైదరాబాద్కు తరలించారు.
