సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్టుపై దర్శకుడు రామ్గోపాల్ వర్మ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘‘పుష్కరాలు, బ్రహోత్సవాల తోపులాటల్లో భక్తులు చనిపోతే దేవుళ్లను అరెస్టు చేస్తారా..? ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటల్లో ఎవరైనా మరణిస్తే రాజకీయ నాయకులని అరెస్టు చేస్తారా..? సినిమాల ప్రీరిలీజ్ ఈవెంట్స్లో ఎవరైనా చనిపోతే హీరో, హీరోయిన్లను అరెస్టు చేస్తారా..? భద్రత ఏర్పాట్లను పోలీసులు, నిర్వాహకులు తప్ప హీరోలు, నాయకులు ఎలా కంట్రోల్ చేయగలరు..?’’ అని ప్రశ్నించారు. అల్లు అర్జున్ కేసు గురించి సంబంధిత అధికారులకు నా నాలుగు ప్రశ్నలు ఇవే అంటూ ఆర్జీవీ పేర్కొన్నారు.
