అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 4న హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ మరణించగా, ఒక బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి, అల్లు అర్జున్తో పాటు థియేటర్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై నమోదైన కేసు రద్దు చేయాలని కోరుతూ అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
