అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ మరోసారి పెట్టుబడిదారుల కోసం ప్రలోభకర ఆఫర్ ఇచ్చారు. ఆయన తన అధికారిక సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’ ద్వారా చేసిన ప్రకటనలో, అమెరికాలో 1 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 8489 కోట్లు) పైగా పెట్టుబడి పెట్టినవారికి అనుమతులు వేగంగా మంజూరు చేయనున్నట్లు హామీ ఇచ్చారు.
