ప్రముఖ ఐవేర్ సంస్థ లెన్స్కార్ట్ తెలంగాణలో భారీ పెట్టుబడులు చేయనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో కొత్త మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు కోసం రూ. 1500 కోట్ల పెట్టుబడితో తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబు సమక్షంలో ఈ ఎంవోయూ పై సంతకాలు జరిగాయి. లెన్స్కార్ట్ దేశంలోనే అతిపెద్ద మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ను తెలంగాణలో నిర్మించనుంది. ఈ యూనిట్ పనులు వచ్చే నెల నుంచే ప్రారంభం కానున్నాయి.
