ప్రజాపాలన విజయోత్సవాల నేపథ్యంలో ఆదివారం ట్యాంక్బండ్, హుస్సేన్సాగర్, పరిసరాల్లో మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ విశ్వప్రసాద్ తెలిపారు. నెక్లెస్ రోడ్ రోటరీ, పాత సైఫాబాద్ పోలీసుస్టేషన్, రవీంద్ర భారతి, తెలుగుతల్లి ఫ్లైఓవర్ జంక్షన్, కవాడిగూడ క్రాస్రోడ్, డీబీఆర్ మిల్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందన్నారు.
