సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మృతిపై తాజాగా అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. సంధ్య థియేటర్లో జరిగిన విషాద సంఘటన హృదయ విదారకంగా ఉంది. ఈ కష్ట సమయంలో దుఃఖిస్తున్న కుటుంబానికి హృదయపూర్వకంగా సానుభూతి తెలియజేస్తున్నాను.
ఈ బాధలో వారు ఒంటరిగా లేరని మరియు కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలుస్తామని,ఈ సవాలుతో కూడిన ప్రయాణంలో వారికి సహాయపడటానికి సాధ్యమైన ప్రతి సహాయాన్ని అందించడానికి నేను కట్టుబడి ఉన్నానని అన్నారు. రేవతి కుటుంబానికి రూ. 25 లక్షల ఆర్థిక సాయంతో పాటు కుటుంబాన్ని ఆదుకుంటానని అల్లు అర్జున్ హామీ ఇచ్చారు.