కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశవ్యాప్తంగా 85 కేంద్రీయ విద్యాలయాలు, 28 నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటిల్లో ఏపీకి 8 కేంద్రీయ విద్యాలయాలు, తెలంగాణకు 7 నవోదయ విద్యాలయాలను కేటాయించింది. ఈ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీవైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.
