టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో మాజీ ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి మహేష్ కుమార్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం మహేష్ కుమార్ మాట్లాడుతూ త్వరలో BRS ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతారని, తమతో టచ్లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ హయాంలో జరిగిన ఫిరాయింపులకు.. ఇప్పటి ఫిరాయింపులకు చాలా తేడా ఉందన్నారు.
