ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ టెస్టు క్రికెట్లో మరో అరుదైన ఘనత సాధించాడు.నాలుగో ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు. ముందుగా ఈ రికార్డు సచిన్ తెందూల్కర్(1625 పరుగులు) పేరిట ఉండేది. రూట్ 1630 పరుగులతో ఈ రికార్డును అధిగమించాడు. ఈ ఘనతను సాధించడానికి సచిన్ 60 ఇన్నింగ్స్ల్లో ఆడగా, రూట్ కేవలం 49 ఇన్నింగ్స్ల్లో ఈ మైలురాయిని చేరుకున్నాడు. జో రూట్ ఇప్పటివరకు 150 టెస్టులు ఆడి 12,777 పరుగులు చేశాడు. ప్రస్తుతం టెస్టుల్లో ఎక్కువ రన్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు.
