అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విడపనకల్లు దగ్గర అదుపు తప్పిన కారు వేగంగా చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. అయితే యోగేష్, వెంకట్ నాయుడు, గోవిందరాజు, అమరేష్ హాంకాంగ్ ట్రిప్ కి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో.. బెంగళూరు నుంచి బళ్లారి వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
