అభివృద్ధి కోసం సీఎం రేవంత్ కి వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్యే

– మాధవరం కృష్ణారావు

కూకట్ పల్లి నియోజకవర్గం లోని పలు సమస్యల పరిష్కారానికి సత్వరం నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అసెంబ్లీ లోని ఆయన ఛాంబర్ లో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. నూతన రోడ్ల నిర్మాణం, మురుగునీటి వ్యవస్థ, తాగునీటి నూతన పైప్ లైన్ల నిర్మాణం, పార్కులు, స్మశాన వాటికల నిర్మాణం సుమారుగా 25-30 కోట్ల రూపాయల నిధులను సత్వరం మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా కూకట్ పల్లి మండలం పరిధిలోని హైదర్ నగర్ గ్రామం సర్వే నెంబర్ 145,163 లలో నిర్మాణ అనుమతులను నిలిపివేసి స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

దశాబ్దాల కాలంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా గానీ ప్రభుత్వపరమైన అన్ని అనుమతులను జారీ చేశారని, ఇటీవల కాలంలో అకస్మాత్తుగా నిర్మాణ అనుమతులను నిలిపివేశారని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులపై, రెవెన్యూ అధికారులు మున్సిపల్ అధికారులపై నెపం వేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న విషయం వివరించారు. అదేవిధంగా జేఎన్టీయూ వెనుక ఉన్న సాయి నగర్ కాలనీ వాసుల ఇళ్ల స్థలాల రెగ్యులరైజేషన్ విషయంలో ప్రభుత్వం దృష్టి సారించాలని, 2014 కు ముందు ప్రభుత్వం నిర్ణయించిన ధరల మేరకు డబ్బులు చెల్లించేందుకు కాలనీ వాసులు సిద్ధంగా ఉన్నారని వారికి న్యాయం చేయాలని కోరారు. అన్ని విషయాలను వివరంగా తెలుసుకున్న ముఖ్యమంత్రి వినతి పత్రాలను సంబంధిత అధికారులకు పంపిస్తానని త్వరలోనే పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News