ఘనంగా.. శ్రీ పెరుమాళ్ళ ఆంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవం

ఆలయాలు అనేవి భారతదేశం ఆథ్యాత్మిక సంపద అని మౌలాలి డివిజన్ కార్పొరేటర్ గున్నాల సునీత శేఖర్ యాదవ్ అన్నారు. సోమవారం ఆమె, మౌలాలి డివిజన్ పరిధిలోని భరత్ నగర్ లోని శ్రీ పెరుమాళ్ళ ఆంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై, స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ ఆలయాన్ని ఇంత అద్భుతంగా పురోభివృద్ధి చేసిన ఆలయకమిటిని అభినందించారు. తాను కార్పొరేటర్ గా విజయం సాధించిన ట్టు ప్రకటించగానే తన అనుచరులతో కలిసి మొదటగా దర్శనం చేసుకున్నది ఈ ఆల యాన్నే అని ఆమె గుర్తుకు చేసుకున్నారు. అప్పుడు ఈ ఆలయం చాలా దయనీయ స్థితిలో ఉండేదని, పురాతనమైన ఈ ఆలయాన్ని అద్భుతంగా రూపు దిద్దుకోవడానికి సహకరించిన దాతలకు, ఆలయ అభివృద్ధి కోసం కష్టపడ్డ కమిటీ సభ్యులకు, అలాగే ప్రతిరోజు ఆలయానికి వస్తున్న భక్తులందరికీ శుభాభినందనలు తెలిపారు.

ఆలయ అభివృద్ధితో పాటు భరత్ నగర్, శ్రామిక నగర్ నెహ్రూ నగర్, గణేష్ నగర్ కాకుండా మౌలాలి లోని అన్ని కాలనీలు కూడా అభివృద్ధి చెందుతున్నాయని, గత నాలుగున్నర ఏళ్లుగా మౌలాలి డివిజన్ ప్రజలంతా చూస్తున్నారన్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులకు, అలాగే దాతలందరికీ కార్పొరేటర్ సునీత శేఖర్ యాదవ్ చేతులు మీదుగా శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పేదలకు ఆలయ ఆవరణలో అన్నప్రసాద వితరణ గావించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ శంకర్, మహేందర్, లోకేష్, ఎల్లం, రాజేష్ యాదవ్, కిరణ్ కుమార్, భాస్కరాచారి, రాందాస్ తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News