హైదరాబాద్, ఫిబ్రవరి 27: అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండలని జిహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి అధికారులను ఆదేశించారు. జోనల్, డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో అందుబాటులో ఉండలని, అధికారులు సిబ్బంది సమయ పాలన పాటించాలని అందుకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (A I) సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని అన్నారు. హెడ్ ఆఫీసులో హెచ్ఓడి లు కూడా అందుబాటులో ఉండేందుకు సిసి కెమెరాలు ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు. జోనల్, డిప్యూటీ కమీషనర్ కార్యాలయాల్లో కూడా సిసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఐటి అడిషనల్ కమీషనర్ ను కోరారు. హెడ్ ఆఫీస్ లో.. హెచ్ఓడి లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టి అదేవిధంగా జోనల్, డిప్యూటీ కమిషనర్ కార్యాలయాలకు మీరే భాధ్యత కాబట్టి అధికారులు, సిబ్బంది సమయ పాలన పాటించే విదంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
