జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీకి ఎన్నికైన వారికి సర్టిఫికేట్లు ప్రధానం

హైదరాబాద్, ఫిబ్రవరి 25: జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీకి ఎన్నికైన వారికి మంగళవారం సర్టిఫికెట్లను ప్రధానం చేసారు. జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగిన నేపథ్యంలో గెలుపొందిన వారికి సెక్రటరీ సత్యనారాయణ ఆధ్వర్యంలో సర్టిఫికెట్లను అందజేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి పాల్గొన్నారు. స్టాండింగ్ కమిటీ సభ్యులుగా గెలుపొందిన 15 మందిలో 10 మందికి సర్టిఫికెట్ అందజేశారు.

చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, హస్తినాపురం కార్పొరేటర్ బాణోత్ సుజాత, అక్బర్ బాగ్ కార్పొరేటర్ సయ్యద్ మిన్హా జుద్దీన్, చాంద్రాయణగుట్ట కార్పొరేటర్ అబ్దుల్ వాహాబ్, ఘాన్సీ బజార్ కార్పొరేటర్ ప్రవీణ్ సుల్తానా, దూద్ బౌలి కార్పొరేటర్ మహమ్మద్ సలీమ్, టోలి చౌకి కార్పొరేటర్ డా.ఆయేషా హుమేరా, హిమాయత్ నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ, రహమత్ నగర్ కార్పొరేటర్ సి.ఎన్.రెడ్డి, రామచంద్రపురం కార్పొరేటర్ బురుగడ్డ పుష్ప ఉన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News