హైదరాబాద్, ఫిబ్రవరి 24: ప్రజావాణిలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి తమకు అందిన ఫిర్యాదులు పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంనిటామని మల్కాజిగిరి సర్కిల్ ఉప కమిషనర్ రాజు తెలిపారు. సోమవారం మల్కాజిగిరి సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి మొత్తం 10 ఫిర్యాదులను స్వీకరించామని చెప్పారు. ఇందులో టౌన్ ప్లానింగ్ – 3, ఇంజనీరింగ్ – 2, శానిటరీ- 3, ఎలక్ట్రికల్ -1, ట్యాక్స్ విభాగం- 1 ఫిర్యాదులు అందాయని వాటిని పరిష్కరించాలని ఆయా విభాగాల అధికారులకు డీసీ రాజు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
