రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన పేరుతో చారిత్రాత్మక నిర్ణయం

హైదరాబాద్, ఫిబ్రవరి 23: కాంగ్రెస్ పార్టీ కులగణన చేపట్టి బీసీ రేజర్వేషన్ల ప్రక్రియను మొదలు పెట్టినందుకు సీఎం.ఏ.రేవంత్ రెడ్డి, టీపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కి, మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ లకు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం బేగంపేటలోని ఫూలే భవన్ లో సీఎం రేవంత్ రెడ్డి, టీపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన బీసీ ముఖ్య నాయకుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి, శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి. జగదీశ్వర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ధన్యవాదాలు తెలిపారు.

అనంతరం జగదీశ్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆశీస్సులతో రేవంత్ రెడ్డి పాలన సాఫీగా సాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం మలి విడత కులగణన కూడా వేగవంతం చేసి.. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రేజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన పేరుతో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని తెలిపారు. స్థానిక ఎన్నికలలో రేజర్వేషన్లు అమలు చేస్తుందని తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలోనే కులగణన జరగడం గర్వకారణం అన్నారు. తెలంగాణ ను అదర్శంగా తీసుకొని కేంద్రం సైతం కుల గణన పై ఆలోచించాలని జగదీశ్వర్ గౌడ్ అన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని బీసీలందరు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News