హైదరాబాద్, ఫిబ్రవరి 15: ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ESCI) లో ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణుల కోసం టెక్నాలజీ రిస్క్ మేనేజ్మెంట్పై రెండు వారాల జాతీయ శిక్షణ కార్యక్రమం (03-14 ఫిబ్రవరి 2025) విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వ శాస్త్ర & సాంకేతిక మంత్రిత్వ శాఖకు చెందిన శాస్త్ర & సాంకేతిక విభాగం (డి ఎస్ టి). ఈ కార్యక్రమానికి ఈ ఎస్ సి ఐ డైరెక్టర్ డా. జి. రామేశ్వర్ రావు హాజరై సంక్షిప్త ప్రసంగం చేశారు. ఈఎస్సి ఐ ఎఫ్డిపి సెల్ హెడ్ & నోడల్ ఆఫీసర్ – డి.ఎస్.టి ప్రోగ్రామ్స్ ఇంజినీర్ సాయి కిషోర్.
ఈ శిక్షణ కార్యక్రమాన్ని సమీక్షిస్తూ.. 12 మంది నిపుణులు, 3 సాంకేతిక రంగ పర్యటనలు, 2 సామాజిక పర్యటనలు ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించామని తెలిపారు. ఇంజినీర్ బి. మోహన్ విజయోత్సవ కార్యక్రమంలో కృతజ్ఞతాభివందన ప్రసంగం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిభాగులు శిక్షణా తరగతులు, నిపుణుల ఇన్పుట్స్, ఫీల్డ్ విజిట్స్, వసతి, భోజన ఏర్పాట్లను ఎంతో మెరుగ్గా ఉన్నాయని ప్రశంసించారు. ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా భవిష్యత్తులో కూడా శాస్త్రవేత్తలు మరియు సాంకేతిక నిపుణుల అభివృద్ధికి తోడ్పడే అగ్రశ్రేణి శిక్షణా కార్యక్రమాలను అందించేందుకు కట్టుబడి ఉంది.