సచివాలయంలో.. పెచ్చులూడి కారు ధ్వంసం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 12: సచివాలయంలోని ఐదో ప్లోర్‌ సౌత్‌ భాగంలోని పట్టీ కూలింది. దీంతో రామగుండం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వాహనం దెబ్బతింది. ఈ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడడం తో పెను ప్రమాదం తప్పింది. పట్టీ మొత్తం కూలే అవకాశం ఉండడంతో వెంటనే మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే సచివాలయంలో అక్కడక్కడ వాటర్‌ లీకేజీ అవుతుండడంతో గోడలు పెచ్చులూడుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే కొన్నిచోట్ల మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం సచివాలయ నిర్మాణానికి రూ.1200 కోట్ల ఖర్చు కాగా, ఈ నిర్మాణం నాసిరకం అంటూ అప్పట్లో కాంగ్రెస్‌ నాయకులు ఆరోపించారు. సచివాలయం ప్రారంభం రోజే అప్పటి పిసిసి అధ్యక్షుడు, ప్రస్తుత సిఎం రేవంత్‌రెడ్డి బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం సచివాలయ నిర్మాణంపై విమర్శలు చేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News