సిఎం రేవంత్‌తో.. మందకృష్ణ తదితరుల భేటీ

  • ఎస్సీవర్గీకరణ నివేదకలో లోపాలున్నట్లు వెల్లడి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 11: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసినందుకు సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలుపుతున్నామని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. మంగళవారం సీఎం రేవంత్‌తో ఆయన భేటీ అయ్యారు. వర్గీకరణ పట్ల చిత్తశుద్దితో వ్యవహరించారని కృతజ్ఞతలు తెలిపారు. అయితే కొన్ని లోపాలు ఉన్నాయంటూ ఆయన సిఎం దృష్టికి తీసుకుని వెళ్లారు. అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారు.

జస్టిస్‌ షవిూమ్‌ అక్తర్‌ నివేదికపై ప్రభుత్వానికి కొన్ని సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. ‘సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణ చేశారు. ఇందులో రేవంత్‌రెడ్డి భాగస్వామ్యం అయ్యారు. అందుకే వారికి ధన్యవాదాలు తెలిపాం. అయితే, జస్టిస్‌ షవిూమ్‌ అక్తర్‌ నివేదికలో కొన్ని లోపాలున్నాయి. ఎస్సీలను 1,2,3 గ్రూపులుగా కాకుండా ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరించాలి. నివేదికలో ఉన్న లోటుపాట్లను సరిచేస్తారని ఆశిస్తున్నాం‘అని మందకృష్ణ అన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News